Wednesday, May 15, 2024

అదుపు త‌ప్పిన బైకు.. కింద‌ప‌డి వ్య‌క్తి మృతి

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : రంగారెడ్డి జిల్లాలో ఘోరం జ‌రిగింది. శంకర్‌ప‌ల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శంకర్‌ప‌ల్లి-హైదరాబాద్ ప్రధాన రోడ్డుపై బైక్ అదుపుత‌ప్పడంతో వాహ‌న‌దారుడు కింద‌ప‌డిపోయాడు. దీంతో అత‌ను అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు. చిట్కుల్ గ్రామానికి చెందిన ఉప్పరి కుమార్ (35) అత్తగారి గ్రామమైన మోకిలకు వచ్చి తిరుగు ప్రయాణంలో ప్ర‌మాదానికి గుర‌య్యాడు. రోడ్డుపై తన ద్విచక్ర వాహనంతో వచ్చే క్రమంలో స్కిడ్ అయి కింద పడిపోయాడు. అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. సంఘటనా స్థలానికి శంకర్‌ప‌ల్లి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement