Tuesday, May 14, 2024

మానసిక ఉల్లాసినికి క్రీడలు

సుభాష్‌నగర్‌ : సుభాష్‌నగర్‌ డివిజన్‌లో మహాశివరాత్రి రోజున ఫ్రెండ్స్‌ యూత్‌ అసోసియేషన్‌ వారు నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ 33 టీమ్స్‌ మొదటిస్థానంలో విజేతగా నిలిచిన హైదరాబాద్‌ నవాబ్‌ టీం వీరికి బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎస్‌. మల్లారెడ్డి, నియోజకవర్గం బీజేపీ సీనియర్‌ నాయకులు కోలన్‌ హన్మంత్‌రెడ్డిలు పాల్గొని 25 వేల రూపాయలను నగదు ట్రోఫి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసీకోల్లాసానికి ఎంతగానో దోహదపడుతాయన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రీడల్లో నైపుణ్యాన్ని సంపాదించుకోవాలని మంచి క్రీడకారులుగా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు కథ శ్రీరాములు, శ్రీధర్‌ రెడ్డి, మర్రి గణేష్‌, దారం సాయికుమార్‌, సాధుయాదవ్‌, సంతోష్‌కుమార్‌, వసంత్‌కుమార్‌ , గణేష్‌ భీమ్‌ రాజ్‌ ప్రెండ్స్‌ యూత్‌ అసోసియేషన్‌ వారు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement