Tuesday, May 7, 2024

గన్ తో బెదిరించి లక్ష్మీ మనీ ట్రాన్స్ఫర్ లో దోపిడీ…

కుత్బుల్లాపూర్ – మనీ ట్రాన్స్ ఫర్ షాప్ లోకి చొరబడి ఇద్దరు దొంగలు గన్ చూపించి యథేచ్ఛగా డబ్బుతో పాటు సెల్ ఫోన్ లను దోపిడీ చేసిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాలలోకి వెళితే.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోద్యనగర్ చౌరస్తాలో గల భాగ్యలక్ష్మి కాలనీలో గ‌త‌ రాత్రి దోపిడి జరిగింది. అనే వ్యక్తి గత 3 సంవత్సరాలుగా లక్ష్మి మనీ ట్రాన్స్ఫర్ అనే షాపు రవి కుమార్ నడిపిస్తున్నాడు. నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో మనీ ట్రాన్స్ఫర్ షాప్ మూసివేస్తున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు షాపు లోపలికి వచ్చి యజమాని రవి కుమార్ కు గన్ తో బెదిరించి.1,95,000/- నగదు తోపాటు మొబైల్ ఫోన్ లను దుండగులు దోచుకెళ్లారు. నెంబరు ప్లేట్ లేని వైట్ కలర్ యాక్టివా పై వచ్చిన దుండగులు 20 – 23 సంవత్సరాలు వయసు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు తెలిపారు. దగ్గరలో ఉన్న సిసి కెమరాల ఫూటేజ్, క్లూస్ టీం ల సహయంతో కేసును దర్యాప్తు చేస్తున్నామని, దుండగులు చూపించిన గన్ నకిలీదా లేక అసలుదా దర్యాప్తులో తేలనుందని, ప్రత్యేకంగా 3 స్పెషల్ టీం లను దర్యాప్తు కొరకు ఏర్పాటు చేసామని జీడిమెట్ల సిఐ బాలరాజు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement