Thursday, April 25, 2024

బుచ్చిలో ఉపాధ్యాయులకు కరోనా – రెండు పాఠశాలలు మూసివేత

బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కరోనా తన ప్రభావాన్ని మళ్లీ చూపుతోంది . ఈ క్రమంలో మండలం లోని ఇస్కపాలెం వడ్డీపాలెం యుపి స్కూల్ లో ఓ ప్రధానోపాధ్యాయుడు కి, రేబాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఎం ఈఓ దిలీప్ కుమార్ తెలిపారు. వెంటనే పాఠశాలల ను మూసివేసి శానిటేషన్ చర్యలు చేపడతున్నామని చెప్పారు. ఉపాధ్యాయులకు కరోనా రావడంతో తోటి ఉపాధ్యాయులను విద్యార్థులను అప్రమత్తం చేశామన్నారు.ఆయా గ్రామాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనుమానం వున్న వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. ఎవరో భయపడవద్దని తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులకు కరుణ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement