Monday, April 29, 2024

ఉప్పెన కెమిస్ట్రీ రిపీట్ కాబోతుంది!!

బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఉప్పెన. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ కృతి కెమిస్ట్రీ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ జోడిని సెట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరిపై మరో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సుకుమార్ శిష్యుడు అయిన మరో యంగ్ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. ఇక వైష్ణవ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్, అలాగే మోహన్ కృష్ణ సుధీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని లింగు స్వామి సినిమాలో కూడా కృతి శెట్టి నటించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement