Wednesday, May 15, 2024

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయం.. గుత్తా

తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయమన్నారు. అభ్యర్థి విషయంలో సీఎం కేసీఆర్ అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుందన్నారు. తిండి ఎక్కువై రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారన్నారు. ఉన్నదాని కంటే ఎక్కువ ఊహించుకోవడం కోమటిరెడ్డి బ్రదర్స్ కు మొదటి నుంచి అలవాటేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement