Thursday, May 2, 2024

తెలంగాణ‌లో మ‌రో మూడు రోజులు వర్షాలు.. హై అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో గురువారం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. రాజధాని హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో పాటు వర్షాలపై జీహెచ్‌ఎంసీ అత్యవసరంగా సమావేశమైంది. జీహెచ్‌ఎంసీలో వర్షాలపై ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 040-21111111, 040-29555500 నెంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement