Saturday, April 27, 2024

ఎడతెరిపి లేకుండా వర్షం.. ఇళ్లలోకి చేరిన వరద నీరు

టేకుమట్ల జులై 25 (ప్రభ న్యూస్) గత మూడు నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గుట్ట నుండి వచ్చే వరద పెద్దంపల్లి గ్రామంలో ఒర్రే నుండి వచ్చిన వరద నీరు దళిత కాలనీలో వర్షపు నీరు ఇండ్ల లో చేరింది దీంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు వంట చేసుకోవడానికి పడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు

వాన కాలంలో అధికారులు శిథిలావస్థకు చేరిన కoగు తిన్న ఇళ్లను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కానీ ఇప్పటివరకు ఇవేమీ జరగలేదని తెలిపారు కాగా ఆసిరెడ్డిపల్లి గ్రామంలోని వెలశాల ప్రాథమిక పాఠశాలలో వరద నీరు చేరింది కాగా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పెద్దంపల్లి దళిత కాలనీవాసులను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement