Saturday, April 27, 2024

Breaking: 26న హైద‌రాబాద్‌కు ప్ర‌ధాని మోదీ… ఐఎస్‌బీ వార్షికోత్స‌వానికి హాజ‌రు

భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈనెల 26న హైద‌రాబాద్ రానున్నారు. ఈ సంద‌ర్భంగా సిటీలోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వార్షికోత్స‌వంలో పాల్గొన‌నున్నారు. అంతేకాకుండా రామ‌గుండంలో ఏర్పాటు చేసిన ఎరువుల క‌ర్మాగారాన్ని కూడా హైద‌రాబాద్ నుంచే మోదీ వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించనున్న‌ట్టు తెలుస్తోంది. ఇక.. పార్టీ ప‌రంగా కూడా మోదీ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌నే స‌మాచారం అందుతోంది. బీజేపీ తెలంగాణ శాఖ‌కు చెందిన కీల‌క నేత‌ల‌తో మోదీ ప్ర‌త్యేకంగా భేటీ అవుతార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మోదీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికే దిశగా బీజేపీ తెలంగాణ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement