Saturday, May 4, 2024

Praja Santhi Party – రైతులు కోరుకుంటే కెసిఆర్ పై పోటీకి సై – కె ఎ పాల్

కామారెడ్డి – కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని రైతులు కోరుకుంటే తాను కెసిఆర్ పై పోటీ చేస్తాన‌ని ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కె ఎ పాల్ ప్ర‌క‌టించారు. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మాస్టర్ ప్లాన్ బాధిత రైతులను కలిశారు. భవిష్యత్తు కార్యచరణపై రైతులతో చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, 72 గంటలలో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల సత్తా చూపిస్తారంటూ హెచ్చరించారు. కేసీఆర్ గెలిస్తే గుంట భూమి మిగలదని రైతులను హెచ్చ‌రించారు. కేసీఆర్ ను ఓడించి కామారెడ్డి చరిత్రలో నిలవాలని పిలుపునిచ్చారు. ముఖ్య‌మంత్రి కెసిఆర్ పై రైతు ప్ర‌తినిధిని పోటీకి నిలపాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement