Friday, May 3, 2024

Flash: అక్రమ వడ్డీపై పోలీసుల కొరడా

కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా అక్రమ వడ్డీ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఫైనాన్స్ కేంద్రాల నిర్వాహకుల ఇళ్లపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. బుధవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు 37 బృందాలుగా విడిపోయి నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమంగా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి ప్రామిసరీ నోట్లు, చెక్కులు, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పోలీసులు కోట్లాది రూపాయల వడ్డీ వ్యాపారానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement