Sunday, April 28, 2024

TS : వినోద్ కుమార్ సోదరుని హోటల్ పై పోలీసుల దాడి.. 6 కోట్ల నగదు స్వాధీనం..

కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ప్రతిమ హోటల్స్ లో పోలీసులు శనివారం తెల్లవారుజామున దాడులు ప్రారంభించారు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు అణువు అణువు సోదాలు చేస్తున్నారు. అర్థరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పోలీసులు ప్రతిమ హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చి తనీఖీలు చేపట్టారు.

శనివారం ఉదయం వరకు కూడా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కరీంనగర్ పోలీసులకు అందిన కీలక సమాచారం మేరకే ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ హోటల్ మాజీ ఎంపీ ప్రస్తుత బి ఆర్ ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ సోదరుడు శ్రీనివాస్ రావు కు చెందింది. ఎన్నికల సమయంలో ఈ దాడి సంచలనం రేపింది. పూర్తి వివరాలను తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement