Monday, May 20, 2024

పోలీస్ అకాడమీలో దీక్షాంత్ సుమారోహ్‌

నగరంలోని సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో దీక్షాంత్‌ సమారోహ్‌ జరుగుతున్నది. శిక్షణ పూర్తిచేసుకున్న 73వ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారులు పాసింగ్‌ అవుట్‌ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఎస్‌వీపీఎన్‌ఏలో మొత్తం 149 మంది శిక్షణ తీసుకున్నారు. ఇందులో 132 మంది ఐపీఎస్‌లు ఉండగా, 17 మంది ఫారెన్‌ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్నవారిలో 27 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. తెలంగాణకు నలుగురు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు ట్రైనీ ఐపీఎస్‌లకు కేటాయించారు. ట్రైనింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన దర్పణ్‌ అహ్లువాలియా పాసింగ్‌ అవుట్‌ కమాండర్‌గా వ్యహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement