Saturday, April 27, 2024

KTR: మార్చి 17 వ‌ర‌కు ఓపిక ప‌డ‌తాం …. ఆ త‌ర్వాత రేవంత్ స‌ర్కార్ కు చుక్క‌లే…

హైద‌రాబాద్ – మోసపూరిత హామీలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను వంద రోజులలో అమలు చేయకపోతే మార్చి 17 తరువాత సీఎం రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం చెబుతామని అన్నారు.

శనివారం కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి చూసి బీఆర్ఎస్ కు పట్టం కట్టారని కేటీఆర్ చెప్పారు. గడిచిన పదేళ్లలో కరెంట్ పోలేదని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరెంట్ పోతుందని.. హైదరాబాద్ గల్లీల్లోకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయన్నారు. చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుందన్నారు. . కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు.

- Advertisement -

చీకటి ఉంటేనే వెలుతురు తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన అర్థం అవుతుందన్నారు. చిన్న పిల్లలు కూడా కాంగ్రెస్ పార్టీ హామీలను గుర్తు చేయాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. హైదరాబాదీ ఓటర్లు తెలివిగా అభివ్రుద్ధికి ఓటేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8 శాతమేనని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మారని కేటీఆర్ ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చాయన్నారు. ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నాడని కేటీఆర్ ఆక్షేపించారు. తమకు నోరు ఉందని, వంద రోజుల వరకూ తామూ ఓపిక పడతామన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని.. గడిచిన పదేళ్లు ప్రధాని మోడీ తమకు సహకరించకపోయిన తాము ఇచ్చిన హామీలు నెరవేర్చామన్నారు కేటీఆర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఎంపీలు ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement