Thursday, May 16, 2024

బిక్షాటన చేస్తూ గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన…

నిజాంబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని రుద్రూర్ మండలంలోని పంచాయతీ కార్మికులు తమ ఘోషను భిక్షాటన ద్వారా ప్రజలకు వివరించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి 17 వ రోజుకు చేరుకుంది.

ఈ సమ్మెలో భాగంగా పంచాయతీ కార్మికులు వినూత్న రీతిలో బస్టాండ్ ప్రాంగణంలోని వ్యాపార సముదాయలలో బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement