Saturday, April 27, 2024

TS | ఆయూష్‌ కోర్సుల్లో ప్రవేశాలకు.. అక్టోబర్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: యూజీ ఆయూష్‌ వైద్యకోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆయూష్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ వైఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ యూనివర్సిటీ ప్రకటన జారీ చేసింది.

నీట్‌ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 26వ తేది ఉదయం 8 గంటల నుండి అక్టోబర్‌ 2వతేది రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. నిర్ధేశిత దరఖాస్తు పూర్తి చేయడంతోపాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement