Sunday, April 28, 2024

TS | ఎంబీబీఎస్‌ ప్రవేశాలకు 28న వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌ ప్రభన్యూస్‌, ప్రతినిధి: ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు ఈనెల 28న వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం స్ట్రేవెకన్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు ఇప్పటికే మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తి అయింది. కన్వీనర్‌కోటాలో ఖాళీగా ఉన్న సీట్లను ఈ రౌండు ద్వారా భర్తీ చేయనున్నారు. ఈనెల 26వ తేదిన సాయంత్రం 4 గంటల వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. అర్హత నిబంధనలు ఇతర సమాచారం వివరాలకు యూనివర్సిటీ వెబ్‌ఆప్షన్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement