Sunday, April 28, 2024

Drowned – కాకతీయ కాలువలో యువకుడు గల్లంతు

తిమ్మాపూర్అక్టోబర్24 ప్రభ న్యూస్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నగర్ కు చెందిన ఎలిగేటి శివకుమార్ (20) సోమవారం రాత్రి కాకతీయ కాలువలో గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ లోని లక్ష్మీ నగర్ కు చెందిన శివకుమార్ కిమ్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇటీవల దుర్గాభవాని మాలధారణ వేసుకున్న శివ సోమవారం మాలవిరమణ చేసుకున్నాడు. అనంతరం తన స్నేహితులతో కలిసి కాకతీయ కాలువ వద్దకు వచ్చి మాలను నీటిలో వేస్తుండగా కాలుజారి ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయి గల్లంతయ్యాడు.

స్నేహితులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తండ్రి మహేష్ తో పాటు కుటుంబ సభ్యులు కాకతీయ కాలువ వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఎల్ఎండిఎస్ఐ ప్రమోద్ రెడ్డి తో పాటు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కాకతీయ కాలువ అధికారులకు సమాచారం అందించడంతో నీటి విడుదలను నిలిపివేశారు. తండ్రి మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement