Thursday, May 16, 2024

చందుర్తి మండలంలో విషాదం..వృద్ద దంపతుల సూసైడ్ కలకలం..

చందుర్తి మండలం అసిరెడ్డిపల్లెలో విషాదం చోటుచేసుకుంది. వృద్ధ దంపతులు కనికరపు దేవయ్య, లక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. గతేడాది నుంచి ఈ దంపతులకు కొడుకులకు మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి.

దీంతో కొడుకు, కోడలు ఇంట్లోని కుల దైవ విగ్రహాన్ని ఇంటి నుండి బయటకు తీసివెస్తమని అనడంతో మనస్థాపానికి గురయ్యారు. ఇవన్నీ చూస్తూ తామింకా బతకలేమని ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న చందుర్తి పోలీసులు విచారణ చేపట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement