Wednesday, May 8, 2024

Notice to Jeevan Reddy ..రూ.45 కోట్లు చెల్లించాలంటూ ఫైనాన్స్ కార్పొరేష‌న్ నోటీస్

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రూ. 20 కోట్ల రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని జీవన్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఉన్న ఆయన ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. ఆయన ఈ రుణాన్ని 2017లో తన భార్య రజితా రెడ్డి పేరుమీద తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న 20 కోట్ల అప్పు వడ్డీతో కలసి 45 కోట్లు అయింది..రుణ చెల్లింపులపై
ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు చెల్లించలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో మరోసారి నోటీస్ జారీ చేసిన అధికారులు చట్టపరమైన చర్యలు చేపట్టేందకు సిద్దమవుతన్నారు..

కాగా, నియోజకవర్గంలో ఉన్న జీవ‌న్ రెడ్డి షాపింగ్ మాల్ కు గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా విద్యుత్ బిల్లులు చెల్లించ‌క‌పోవ‌డ‌తో ఆ శాఖ నోటీసులు జారీ చేసింది.. జ‌రిమానాతో స‌హా మొత్తం ఏడు కోట్లు చెల్లించాల‌ని ఆ నోటీసులో పేర్కొంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement