Wednesday, May 15, 2024

మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబానికి చెక్ పంపిణి

నిజామాబాద్ సిటీ, జూలై (ప్రభ న్యూస్)13: నిజామాబాద్ జిల్లాలో మరణిం చిన పోలీస్ సిబ్బంది కుటుంబా నికి ఇంచార్జి పోలీస్ కమిషనర్ సి.హెచ్.ప్రవీణ్ కుమార్ చెక్ అంద‌చేశారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయం ప‌రిధితోని టౌన్ పిఎస్ విధులు నిర్వ‌హిస్తున్న కానిస్టేబుల్ ఎన్. రవి అనారో గ్యంతో మరణించారు. దీంతో భద్రత ఎక్సిగ్రేషియా రూపంలో గల చెక్కు రూ॥ 8,00,000/- ( ఎనిమిది లక్షల రూపాయల) చెక్కును పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇంచార్జీ పోలీస్ కమిషనర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్, చేతుల మీదుగా కీ . రవి సతీమణి . జయ విజయ కు చెక్కును అందజేసారు.

ఈ కార్య‌క్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్ ) జి. మధుసుదన్ రావు నిజామా బాద్ ఎ.సి.పి కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా ,వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement