Monday, April 29, 2024

Protest – సంగారెడ్డి ఐబి వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

సంగారెడ్డి, జులై 13 (ప్రభ న్యూస్): రైతుల పక్షం ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రైతుల వ్యతిరేకి రేవంత్ రెడ్డి అని రాష్ట్ర హ్యడ్లూం కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. గురువారం నాడు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు నిరసనగా సంగారెడ్డి ఐబి వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

అనంతరం చింత ప్రభాకర్ మాట్లాడుతూ వ్యతిరేకి గా పేరు మోసిన చంద్రబాబుకు రేవంత్ రెడ్డి వారసుడిగా కరెంటు సమస్యలపై బషీర్బాగ్ కాల్పుల ఘటన పునరావతం చేస్తున్నారని. కాంగ్రెస్ విధానాలను రేవంత్ బయట పెట్టారన్నారు రేవంత్ రెడ్డి మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతుల బతుకులు ఆగమయితాయన్నారు. సంవత్సరాల పాలనలో రైతుల సంక్షేమం కోసం 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమ, సబ్సిడీపై ఎరువులు పురుగు మందులు యంత్రపరికారాల వంటి అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనిని, రానున్న ఎన్నికల్లో రైతు ప్రభుత్వం అధినేత కేసిఆర్ ది విజయం అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నరహహరిరెడ్డి .సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి, కౌన్సిలర్ జలెందర్, నక్క నాగరజు గౌడ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ నివాస రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల పార్టీ శ్రేణులు. కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement