Sunday, May 5, 2024

త‌డిసిన ధాన్యం కొనుగోలు చేయాలి : ఎమ్యెల్యే సురేందర్

నిజామాబాద్, ప్రభ న్యూస్ : గాంధారి మండలంలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి గాంధారి మార్కెట్ కమిటీలో రైతులు ఆరబెట్టుకున్న వ‌రి ధాన్యం తడిసి ముద్దయింది. సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే సురేందర్ సోమవారం తడిసిన ధాన్యాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులతో, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల‌కు వారికి అండగా ఉందని, అన్ని విధాలా పంట తడిసిన రైతులకు ఆదుకుంటామని ధైర్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement