Saturday, May 4, 2024

TS: పేదింటి ఆడబిడ్డలకు తులం బంగారం హామీని నెరవేర్చాలి… ధన్ పాల్

నిజామాబాద్, మార్చి 11(ప్రభ న్యూస్) : నిరుపేద ఆడబిడ్డల కళ్యాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానన్న హామీ నెరవేర్చాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఆడబిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారన్నారు. సోమవారం ఇందూర్ పట్టణం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ… పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి, వారి కుటుంబానికి ఆర్ధిక భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష నూటపదహారు రూపాయలు పంపిణీ చేస్తుందని.. ఈ చెక్కు లు జారీ చేయడంలో జాప్యం జరుగుతుందని వాపోయారు.

రాష్ట్ర ప్రభుత్వం అర్జీ పెట్టుకున్న అర్హులందరికీ వీలైనంత త్వరగా చెక్కులు విడుదల చేయాలని సూచించారు. అలాగే నగరంలో అర్హులైన 895 మందికి చెక్కులు పంపిణీ చేశామన్నారు. అందులో కల్యాణ లక్ష్మి 211, షాదీ ముబారక్ 684 పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం అర్హులైన వారికీ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement