Thursday, May 2, 2024

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ ఆదర్శం.. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

బిక్కనూరు : అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో రూ.50లక్షలతో నిర్మించిన సహకార సంఘ భవనంతో పాటు గ్రామంలో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పై కక్ష సాధింపులకు పాల్పడుతూ నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు.

అయినప్పటికీ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నీ అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈనెల 28 నుండి రైతుల ఖాతాలో రైతుబంధు డబ్బులు జమ చేయడం జరుగుతుందని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో అమలుకాని పథకాలు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శేఖర్, ఉపాధ్యక్షులు హనుమంత రెడ్డి, గ్రామ సర్పంచ్ మంజుల మల్లారెడ్డి, ఉప సర్పంచ్ బిక్షపతి, మండల తెరాస అధ్యక్షులు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్, మండల తెరాస యూత్ అధ్యక్షులు రంజిత్ వర్మ, జిల్లా సహకార బ్యాంకు డైరెక్టర్ కృష్ణ గౌడ్, గ్రామ తెరాస అధ్యక్షులు సిద్ది రామ్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement