Tuesday, April 23, 2024

సంక్రాంతికి క‌లుద్దాం- వాల్తేరు వీర‌య్య‌ పోస్ట‌ర్

ఆచార్య చిత్రం మెగా అభిమానుల‌ని నిరాశ ప‌రిచింది. మెగాస్టార్ చిరంజీవి..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఈ చిత్రంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వారికి య‌డిఆశే అయింది. దాంతో చిరంజీవి త‌న నెక్ట్స్ చిత్రాల‌పై ఫోక‌స్ పెట్టారు. తాజాగా రెండు సినిమాల‌ షూటింగ్‌ల‌ను ఏక‌కాలంలో జ‌రుపుతున్నారు చిరంజీవి. అందులో బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘వాల్తేరు వీర‌య్య’ ఒక‌టి.విశాఖ‌ప‌ట్నం నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మాస్‌రాజ ర‌వితేజ కీల‌క‌పాత్రలో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ తాజాగా ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో చిరంజీవి అండ‌ర్‌క‌వ‌ర్ కాప్‌గా క‌నిపించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement