Friday, May 3, 2024

Breaking : పాఠ‌శాల‌లోని 40మంది – ఎన్ సీసీ విద్యార్థుల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు

ఓ పాఠ‌శాల‌లోని 40మంది ఎన్ సీసీ విద్యార్థుల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించారు. దాంతో వారిని అధికారులు ఐసోలేష‌న్ వార్డులో ఉంచారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్‌కేఆర్‌ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఈనెల 18 నుంచి పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 317 మంది ఎన్‌సీసీ క్యాడెట్లతో క్యాంప్‌ కొనసాగుతుంది. వీరు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో పరీక్షించిన వైద్యులు 40 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వీరిని వెంటనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. వీరితో తిరిగిన సహచర విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పడు తెలుసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement