Thursday, April 25, 2024

దొంగను పోలీసులకు పట్టించిన యువకులు

మరిపెడ: పెళ్లికి వచ్చి పక్కింట్లో దొంగతనానికి యత్నించిన దుండగుడిని గ్రామ యువత పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అనేపురం గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున 4గంటలకు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అనేపురంలో జరుగుతున్న ఓ వివాహానికి పిలవని అతిథిగా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన విఘ్నేష్ గురువారం రాత్రి వచ్చాడు.

ఉదయం సుమారు 3:30 గంటల సమయంలో అనేపురం గ్రామ పంచాయతీలోని మొదటి వార్డు కూలీ చేసుకొని బ్రతికే బకరం.వెంకన్న ఇంటిపై కన్నేశాడు. అందరూ నిద్రించాక ఇంట్లోకి చొరబడి రూ.20వేలు తస్కరించి పరార్ అయ్యేందుకు యత్నించాడు. ఇది గమనించిన గ్రామ యువకులు దొంగను చాకచక్యంగా పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. ఈ మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement