Wednesday, May 1, 2024

NZB: సమస్య పరిష్కరించేంత వరకు వెళ్లేది లేదు… ప్రజావాణిలో జాంకంపేట్ గ్రామస్తులు..

నిజామాబాద్ సిటీ, ఫిబ్రవరి 5(ప్రభ న్యూస్): నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూరు మండలంలోని జానకంపేట-పచ్చల నడ కుడ గ్రామాల మధ్య నెలకొన్న సరిహద్దు వాగు సమస్య పరిష్కరించి రెండు గ్రామాలు శాంతి నెలకోలపాలని జాన్కం పేట గ్రామస్తులు కోరారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి జానకంపేట గ్రామస్తులు సరి హద్దు వాగు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అధిక సంఖ్యలో తరలివచ్చారు.

- Advertisement -

ప్రజావాణిలో తమ సమస్య పరిష్కరించెంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించుకొని కూర్చొని ప్రజావాణి లో బైఠాయించారు. సమస్య పరిష్కరిస్తామని సముదాయించడంతో జాంకంపేట్ గ్రామస్తులు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జానకంపేట గ్రామస్తులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇరు గ్రామాల మధ్య పెండింగ్‌లో ఉన్న సరిహద్దు వాగు సమస్యపై జిల్లా కలెక్టర్ ప్రభుత్వం దృష్టిసారించి ప్రత్యేక చర్యలు తీసుకొని సరిహద్దు వాగు సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జానకంపేట గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement