Saturday, May 4, 2024

AP: మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించ‌కుంటే అరెస్ట్ చేయిస్తాం ….పోలీసుల‌కు హైకోర్టు వార్నింగ్ ..

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించని పోలీసు అధికారులను అరెస్ట్ చేయించ‌డానికి వెన‌కాడ‌బోమ‌ని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిషన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్న కేసులో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది. ఇలాంటి కేసుల్లో సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని తెలిపింది. పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎంపీలు, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. సాంబశివరావును అరెస్ట్ చేస్తే బాధ్యులు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. ఉల్లంఘంచిన ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేలా లేదని వ్యాఖ్యనించింది. ఈ క్రమంలో వివరాలు అందించేందుకు సమయం కావాలని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement