Sunday, May 5, 2024

Owaisi: లోక్ స‌భ‌కు మూడు స్థానాల‌లో ఎంఐఎం పోటీ … ఎంపి అస‌దుద్దీన్

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు పోటీ సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు నియోజకవర్గాల వారీగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో పార్టీ అధినేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేస్తున్న ఎంఐఎం పార్టీ మూడు స్థానాల్లో నుంచి పోటీ చేయాల‌ని బావిస్తున్న‌ది.

హైదరాబాద్‌తో పాటు మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్, బీహార్ లోని కిషన్‌గంజ్ పార్లమెంటు స్థానాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దింపనున్నట్లు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బహదూర్‌పూర అసెంబ్లీ సెగ్మెంట్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం తరపున ముగ్గురు అభ్యర్థులను నిలబెడుతున్నాయని తెలిపారు. పెద్దల సభలో ముస్లింల గళాన్ని వినిపించేందుకు తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement