Sunday, May 5, 2024

ర్యాగట్లపల్లి గ్రామం రాష్ట్రానికే ఆదర్శం.. ఎస్పీ శ్రీనివాసరెడ్డి

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి B అన్నారు. శుక్రవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. ఇటీవల క్రైమ్ ఫ్రీ గ్రామంగా ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇప్పటివరకు గ్రామంలో ఎలాంటి కేసులు లేకపోవడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. పోలీసు మెట్లు ఎక్కని గ్రామం రాష్ట్రంలో మొట్టమొదటి గ్రామం ఇదేనన్నారు. గ్రామస్తుల ఐక్యతను ఆయన అభినందిస్తూ… పలువురిని శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డి.ఎస్.పి సోమనాథ్, సిఐ తిరుపయ్యా, ఎస్సై ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement