Tuesday, April 30, 2024

ముఖేష్ అంబానీకి జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరి-నిర్ణ‌యించిన కేంద్ర ప్ర‌భుత్వం

ప్ర‌పంచంలోని 10వ అత్యంత సంప‌న్న వ్య‌క్తి అంబానీ . గత ఏడాది ప్రారంభంలో ముంబైలోని అతని ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన SUV కనిపించడంతో అంబానీ భద్రతను పెంచారు..భద్రతను జడ్ ప్లస్ కేటగిరికి పెంచినట్టు తెలుస్తోంది. మూలాల ప్రకారం.. ముఖేష్ అంబానికి ముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్, భద్రతా సంస్థలు ఇచ్చిన నివేదికలను స‌మీక్షించి..ఆయ‌న‌కు ‘Z+ భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌ని కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రేరేపించింది. అంతకుముందు, మరో పారిశ్రామికవేత్త .. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి గత నెలలో కేంద్ర ప్రభుత్వం CRPF కమాండోల ‘Z’ కేటగిరీ VIP భద్రతను ఇచ్చింది. చెల్లింపు ప్రాతిపదికన కూడా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. ముఖేష్ అంబాని భద్రత కోసం ఏర్పాటు చేసిన జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఏర్పాట్లకు అయ్యే సిబ్బంది ఖర్చులను ఆయనే భరిస్తారు. ఇటీవల ముంబైలోని ముఖేష్ ఇంటి స‌మీపంలో జ‌రిగిన సంఘ‌ట‌న ఆయ‌న భద్రతకు సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చెల్లింపు ప్రాతిపదికన మొదటిసారిగా 2013లో ఆయ‌న‌కు CRPF కమాండోల ‘Z’ కేటగిరీ కవర్‌ను అందించారు. అతని భార్య నీతా అంబానీకి కూడా ఇలాంటి సాయుధ కవర్ ఉంది. వారికి Y+ కేటగిరీ భద్రత ఉంది. ఇందులో కమాండోల సంఖ్య కూడా తక్కువ.

Advertisement

తాజా వార్తలు

Advertisement