Tuesday, May 14, 2024

ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు… విప్ గంప గోవర్ధన్

బిక్కనూరు : ఆగస్టు 15 నుండి కొత్త పింఛన్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చెప్పారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ… అర్హులైన ప్రతిఒక్కరికీ కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై లేనిపోని నిందలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఈనెల 25 నుండి రైతు బంధు పథకం కింద రైతులకు ఖాతాలో డబ్బు జమ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, గ్రామ సర్పంచ్ మంజుల మల్లారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement