Monday, April 29, 2024

అడవిపంది దాడిలో పలువురికి గాయాలు

బిక్కనూర్ : అడవి పంది దాడిలో పలువురికి గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సోమవారం అడవి పంది గ్రామంలో సంచరించడంతో గ్రామస్తులు దానిని తరిమేందుకు ప్రయత్నించగా.. గ్రామస్తులపై దాడి చేసింది. అడవి పంది దాడిలో గ్రామానికి చెందిన లింగాల రవి, కమ్మరి రాములు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement