Monday, April 29, 2024

క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొన్న న్యాయమూర్తులు, న్యాయవాదులు

కామారెడ్డి : కామారెడ్డి న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు క్రీడా పోటీలు నిర్వహించారు. మంగళవారం స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ లో సీనియర్ సివిల్ జుడ్జ్ XI, తొమ్మిదవ అదనపు జిల్లా జడ్జ్ XI జట్లు పోటీలో పాల్గొన్నారు. 9వ అదనపు జిల్లా జడ్జ్ క్రికెట్ జట్టు గెలుపొందడం జరిగింది. ఈ కార్యక్రమానికి తొమ్మిదవ అదనపు న్యాయమూర్తి రమేష్ బాబు పాల్గొని పోటీలను ప్రారంభించి, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు క్రీడల్లో పాల్గొనడం వలన రోజు వుండే పనుల ఒత్తిడి నుండి ఉల్లాసం పొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాస్, మొబైల్ జడ్జ్ వెంకటేష్ ధ్రువ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వైద్య అమృతరావు, ఉపాధ్యక్షులు శేషు, ప్రధాన కార్యదర్శి మాక్సూద్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, క్రీడల కార్యదర్శి జడల రజనీకాంత్, లైబ్రరీ కార్యదర్శి దేవేందర్ గౌడ్, సీనియర్ న్యాయవాదులు జగన్నాథం, శంకర్ రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్, రాజ్ గోపాల్ గౌడ్, శ్యామ్ గోపాల్ రావు, బండారి సురేంద‌ర్ రెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement