Sunday, April 28, 2024

NZB: జర్నలిజంలో మహిళలు రాణించడం అభినందనీయం.. మేయర్ నీతూ కిరణ్

నిజామాబాద్, మార్చి 6(ప్రభ న్యూస్) : జర్నలిజంలో మహిళలు రాణించడం అభినందనీయ, సమాజ మార్పునకు దోహద పడాలని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. మీడియా రంగంలో పురుషులతో సమానంగా మహిళా జర్నలిస్టులు కూడా నేడు పోటీ పడుతుండటం విశేషమని ఆమె కొనియాడారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి హాజరయ్యారు. మహిళా జర్నలిస్టులతో కలిసి క్యారం ఆడారు. వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులు యాంకర్లు, సబ్ ఎడిటర్లను ఘనంగా సన్మానించారు. మహిళా జర్నలిస్టుల ఆధ్వర్యంలో అతిథులను సన్మానించారు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు..

కులం కంటే కలం గొప్పది.. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత..

నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేది ఒక్క మీడియాతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. కులం కంటే కలం గొప్పదని జర్నలిస్టులు రాసే ప్రతివార్త సమాజానికి ఒక మంచి సందేశంగా ఉండాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ- శేఖర్, కోశాధికారి సందీప్ -నిర్వహణ కార్యదర్శి మోహన్, కమిటీ ప్రతినిధులు గోవింద్ రాజు ప్రమోద్ గౌడ్ ప్రసాద్, రవి చరణ్, సుదర్శన్, ప్రీతం, అహ్మద్, పూర్వ అధ్యక్షలు గంగదాస్ రాజేష్ సీనియర్ జర్నలిస్టులు శ్రీకాంత్ పిటి శ్రీనివాస్,రాజేష్ … జగన్..భూమేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement