Monday, April 29, 2024

TS – 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ – స్కూళ్ల‌కు చేరిన హాల్ టిక్కెట్స్

ఆన్ లైన్‌లోనూ అందుబాటులో
రాత ప‌రీక్ష‌కు 5.08 ల‌క్షల మంది విద్యార్ధులు
2676 ఎగ్జామ్ సెంట‌ర్స్ ..
అయిదు నిమిషాలు గ్రేస్ టైమ్
నిమిషం నిబంధ‌న స‌డ‌లింపు

తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్‌ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్‌ టికెట్లను స్కూళ్లకు అధికారులు పంపించారు. అలాగే స్కూళ్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు నేరుగా హాల్టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ పరీక్షల కోసం 2,676 సెంటర్లను ఏర్పాటు చేయగా.. 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవనున్నారు. పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు, 18వ తేదీనే ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి. ఇక టెన్త్ ప‌రీక్ష‌ల‌లోనూ నిమిషం నిబంధ‌న‌లో మార్పు చేశారు.. గ్రేస్ పిరియ‌డ్ ను అయిదు నిమిషాల‌కు పెంచారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే..

మార్చి 18: ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)
మార్చి 19: సెకండ్ లాంగ్వేజ్( హిందీ)
మార్చి 21: థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
మార్చి 23: మ్యాథమెటిక్స్
మార్చి 26: సైన్స్ పేపర్ -1(ఫిజిక్స్)
మార్చి 28: సైన్స్ పేపర్ -2(బయాలజీ)
మార్చి 30: సోషల్ స్టడీస్
ఏప్రిల్ 1: ఒకేషనల్‌ కోర్సు (సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్‌),
ఏప్రిల్ 2: ఒకేషనల్ కోర్సు(సంస్కృతం, అరబిక్ రెండో పేపర్‌)

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement