Friday, May 3, 2024

TS: అపార్ట్ మెంట్ పై నుండి దూకి వ్యక్తి ఆత్మహత్య..

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సీతారాంపూర్ లోని సుచిత్ర రెసిడెన్సి 5వ ఫ్లోర్ పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గత రెండు సంవత్సరాల క్రితం నుండి సుచిత్ర రెసిడెన్సీలో భార్య సువర్ణదీవితో పాటు కామారపు రమేష్ నివాసం ఉంటున్నారు.

గత కొద్ది రోజుల నుండి ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య పూజా సామాగ్రి అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుందని తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం కామారపు రమేష్ ఐదో ఫ్లోర్ పైకి ఎక్కి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అపార్ట్ మెంట్ వాసులు కూడా తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement