Wednesday, May 1, 2024

NZB: కామారెడ్డిలో చెల్లని రూపాయి.. నిజామాబాద్ లో చెల్లుతుందా..? ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, నవంబర్ 17 (ప్రభ న్యూస్) : కామారెడ్డి ప్రజలు ఛీ కొడితే.. కాంగ్రెస్ నాయకుడు నిజామాబాద్ కు వచ్చి పోటీ చేయడమా.. కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్ లో చెల్లుతుందా అని బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ ప్రశ్నించారు. కామారెడ్డి సొంత నియోజకవర్గ ప్రజలే వద్దు అనుకున్నప్పుడు మనకు అవసరమా అని అన్నారు. ఎన్నో ఏండ్లుగా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థుల మాయమాటలు నమ్మొద్దని, నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని… ఒక్కసారి అవకాశం ఇవ్వండని బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇవాళ 9వ డివిజన్ లోని ఇంద్రపూర్ కాలనీ నుంచి బీజేపీ అభ్యర్థి దన్ పాల్ సూర్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ… నగరంలో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ మీ వాడిని అని తీరుగుతున్నాడని.. మన సమస్యలు మనకు తెలుసునని కామారెడ్డి నాయకుడి కాదన్నారు. తాను గత ఎన్నో సంవత్సరాల నుండి నిజామాబాదు ప్రజలకు అందుబాటులో ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.

కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పేదలకు అందజేయకపోవడం బాధాకరమన్నారు. పేదల సమస్యలు ఎన్నో ఏండ్ల నుంచి వాళ్ళ బాధలు తీర్చే నాయకుడే లేడని వాపోయారు. ఒక్కసారి కమలం పువ్వుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరారు. మీ అందరి సహకారంతో గెలిచిన తరువాత ఇందూరు ప్రజల కష్టాలు తీరుస్తానన్నారు. ఈ సందర్బంగా డివిజన్ నాయకులు భారీ గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ నాయకులు కోడూరు నాగరాజు, సాయినాథ్, కిరణ్, మారుతీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, పంచరెడ్డి లింగం, న్యాలం రాజు, బీజేపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement