Thursday, May 16, 2024

NZB: ఎమ్మెల్యే బాజిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

నిజామాబాద్ రూరల్, నవంబర్ 7 (ప్రభ న్యూస్) : రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ నివాసంలో ఇవాళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరారు. డిచ్ పల్లి నుండి గ్రామ సర్పంచ్ అధ్వర్యంలో వివిధ సంఘాలకు చెందిన 70మంది బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే జక్రణ్ పెల్లి మండలం తొర్లి కొండ కు చెందిన ముదిరాజ్ అంబేడ్కర్ జై భీమ్ యూత్ సభ్యులు మొత్తం 400మంది పార్టీలో చేరారు.

ఒన్న జీ పెట్ కు చెందిన యాదవ సంఘం తుంపెల్లి మునిపెల్లికి చెందిన వంద మంది బీఆర్ఎస్ లో చేరారు. మోపాల మండలం కంజర్ కు చెందిన రెడ్డి కా.దిమ్మెర కాపు కులస్థుల ఉప సర్పంచ్ చిన్నారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు మధు అధ్వర్యంలో వంద మంది చేరినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement