Tuesday, April 30, 2024

TS: దేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ రావాలి.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్…

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 25(ప్రభ న్యూస్) : దేశం సుభిక్షంగా, భద్రత‌గా ఉండాలంటే మరోసారి ప్రధానిగా మోడీ కావాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై కమలం వికసించేందుకు తోడ్పడాలని కోరారు. ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిన నాయకుడు ప్రధాని మోడీ అని తెలిపారు. బీఆర్‌ఎస్‌- కాంగ్రెస్‌ రెండూ ఒక్కటేనని, ఆ రెండు పార్టీల వైఖరి ఒకేలా ఉంటోందని ఆ రెండు దొందు.. దొందేనని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ అన్నారు. దేశంలో కాంగ్రెస్ కు, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలు, ప్రజలను దోచుకోవడానికి… ఓట్లు అడగడానికి వస్తున్నాయని.. అభివృద్ధిపై ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.

గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత కలెక్టరేట్ మైదానంలో ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉత్తరకాండ్ ప్రాంతం గంగోత్రి, యమునా, భద్రీనాథ్, కేదార్నాథ్ దేవతలు కొలువు దిరిన ప్రాంతమని తెలిపారు. ఆ ప్రాంతాలను పూర్తిగా అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సమర్థవంతుడని ప్రధాని మోదీ సహకారంతో నిజామాబాద్ జిల్లాని ధర్మపురి అరవింద్ అభివృద్ధి చేశాడని గుర్తు చేశారు. ఈ సభలో ఇంతమంది ఉత్తేజం, జోష్ ని చూస్తుంటే నిజా మాబాద్ జిల్లాలో భారీ మెజారిటీతో ధర్మపురి అరవింద్ ని గెలిపిస్తారని నమ్మకం ఉందన్నారు. ఎన్ని దుష్టశక్తులు కుట్రలు పన్నినా 400 సీట్లతో అత్యధిక మెజార్టీతో కేంద్రంలో బీజేపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

500 సంవత్సరాల కలను సాకారం వేళ…
భారతదేశంలో ప్రజలు అయోధ్య రాముడి దర్శనం కోసం వందల సంవత్సరాల నుంచి ఎదురుచూసేవారు. 500 సంవత్సరాల కలను సాకారం చేసిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. దివ్య రాముడి ఆశీస్సులతో మరోసారి ప్రధాని మోదీ కావడం ఖాయమని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమీషాల సహకారంతో పసుపు బోర్డు సాధనలో ఎంపీ అరవింద్ కృషి ఎంతో ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, అల్జాపూర్ శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement