Tuesday, April 30, 2024

Nominations- తెలంగాణ‌లో ముగిసిన నామినేష‌న్ల ప‌ర్వం

చివ‌రిరోజు వెల్లువెత్తిన నామినేష‌న్లు
బండి, వెంక‌ట్రామిరెడ్డి, మాధ‌విల‌త‌,
ధ‌ర్మ‌పురి, బాబు మోహ‌న్ లు నామినేష‌న్లు
మ‌ల్కాజిగిరిలో ఏకంగా 101 నామినేష‌న్లు
తెలంగాణాలో ఇప్పటి వ‌ర‌కూ 572 నామినేషన్లు

తెలంగాణాలో నామినేష‌న్ల ప‌ర్వం నేటితో ముగిసింది.. చివ‌రి రోజైన నేడు నామినేష‌న్లు వెల్లువెత్తాయి.. ఆయా నియోక‌వ‌ర్గాల రిట‌ర్నింగ్ అధికారుల కార్యాల‌యాలు నామినేష‌న్ వేసే అభ్య‌ర్ధుల‌తో కిట‌కిట లాడాయి.. ఇక తెలంగాణ‌లో నేడు బిజెపి అభ్య‌ర్ధి బండి సంజయ్ క‌రీంన‌గ‌ర్ స్థానానికి, మెద‌క్ బిఆర్ ఎస్ అభ్య‌ర్ధి వెంక‌ట్రామిరెడ్డి, హ‌ద‌రాబాద్ స్థానంలో బిజెపి అభ్య‌ర్ధి మాధ‌వీ ల‌త‌, నిజ‌మాబాద్ బిజెపి అభ్యర్ధి ధ‌ర్మ‌పురి అర‌వింద్, వరంగ‌ల్ లో స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా బాబు మోహ‌న్ తో తో పాటు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌లో భారీ సంఖ్య‌లో నామినేష‌న్లు వేశారు. మ‌ల్కాజిగిరి లోక్ స‌భ స్థానానికి అత్య‌ధిక సంఖ్య‌లో 101 నామినేష‌న్లు దాఖ‌లు కాగా, మ‌హ‌బూబాబాద్ స్థానంలో అత్య‌ల్పంగా 31 నామినేష‌న్ లు వేశారు. లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే నాటికి సుమారు 572 మంది అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు 38 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

- Advertisement -

నియోజకవర్గాల వారిగా దాఖలైన నామినేషన్లు:
ఆదిలాబాద్- 39
భువనగిరి- 81
చేవెళ్ల-59
హైదరాబాద్-48
కరీంనగర్-69
ఖమ్మం-57
మహబూబాబాద్-32
మహబూబ్ నగర్-42
మల్కాజిగిరి-101
మెదక్-55
నాగర్ కర్నూల్-23
నల్గొండ-85
నిజామాబాద్-77
పెద్దపల్లి-74
సికింద్రాబాద్-60
వరంగల్-62
జహీరాబాద్-41

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ బై పోల్ కు:38

Advertisement

తాజా వార్తలు

Advertisement