Friday, April 26, 2024

నిజామాబాద్ జిల్లాలో దారుణం.. అనుమానంతో భార్యాపిల్లలను చంపిన భర్త

నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో దారుణం జరిగింది. అనుమానంతో ఓ భర్త తన భార్య, కూతురిని హత్య చేసాడు. వివరాల్లోకి వెళ్తే.. రుద్రూర్‌కు చెందిన మల్లీశ్వరీ, గంగాధర్‌ భార్యాభర్తలు. వారికి ఒక కూతురు ఉంది. కాగా ఇటీవల భార్య మల్లీశ్వరిపై భర్త గంగాధర్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో గత కొన్ని రోజులుగా ఆమెను హింసిస్తున్నాడు.

ఈ క్రమంలో గురువారం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన గంగాధర్ ఇంట్లో ఉన్న గొడ్డలితో మల్లీశ్వరి, కూతురు రుత్వికను తలపై నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. దీంతో ఏసీపీ రామారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్యలు జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement