Sunday, May 5, 2024

విజయసాయిరెడ్డి పిటిషన్ పై తీర్పు రిజర్వ్

తమపై నమోదైన కేసుల్లో మొదట ఈడీ కేసులను విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిగింది.  మొదట ఈడీ కేసులు విచారించాలన్న ఉత్తర్వులు కొట్టివేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.

ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదించారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కేసులు, ఈడీ కేసులు వేర్వేరని తెలిపారు. 2019లో మనీ లాండరింగ్ చట్టాన్ని సవరించారని, ఈ క్రమంలో ముందుగా ఈడీ కేసులు విచారణ జరపాల్సిన అవసరం ఉందని విన్నవించారు. ప్రధాన కేసు నుంచి విడిగా ఈడీ చార్జిషీట్లపై విచారణ జరపాలని కోరారు.

అంతకుముందు, విజయసాయి, జగతి పబ్లికేషన్స్ తరఫున సీనియర్ అడ్వొకేట్ ఎస్.నిరంజన్ రెడ్డి వాదించారు. మొదట ఈడీ కేసులు విచారించాలన్న సీబీఐ-ఈడీ కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ కేసులతో ఈడీ కేసులకు సంబంధం ఉందని స్పష్టం చేశారు. సీబీఐ కేసుల ఆధారంగానే ఈడీ విచారణ షురూ అయిందని వెల్లడించారు. తొలుత సీబీఐ కేసులను విచారించాలని, లేనిపక్షంలో సీబీఐ, ఈడీ కేసులను సమాంతరంగా విచారణ జరపాలని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.

ఇది కూడా చదవండి: గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం వాయిదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement