Saturday, April 13, 2024

నెల్లూరులో సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం

కరోనా ఆపత్కాలంలో సామాన్య ప్రజలనుంచి సెలబ్రిటీల వరకు సాయం చేసిన సోనూసూద్.. ఇప్పటికీ ఈ మహమ్మారి కట్టడికి కృషి చేస్తూనే ఉన్నాడు..దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల్ ఏర్పాటుకు పూనుకున్నాడు.. దానిలో భాగంగానే తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ఈరోజు ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని జిల్లా వైద్యశాల లో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. కోటి యాభై లక్షల రూపాయల నిధులతో తన సొంత పౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాన్ని జిల్లాకు చెందిన దివ్యాంగురాలు నాగలక్ష్మి చేతులమీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జిల్లా కలెక్టర్ చక్రధర బాబు,జిల్లా జాయింట్ కలెక్టర్ స్థానిక ఆర్డీవో ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ ద్వారా సోనూసూద్ ఇక్కడి అధికారులతో మాట్లాడారు.

ఇది కూడా చదవండి : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ బోర్డర్ మూసివేత..

Advertisement

తాజా వార్తలు

Advertisement