Wednesday, May 15, 2024

కామారెడ్డిలో అగ్ని ప్రమాదం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా గల కృష్ణ రమేష్ మిఠాయి దుకాణంలో అగ్నిప్రమాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగింది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం జ‌రిగిన‌ట్లు దుకాణం యజమాని కిషన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌క్క‌పోవ‌డంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement