Tuesday, May 7, 2024

టి 20 – పాకిస్థాన్ కు అఫ్ఘానిస్థాన్​ షాక్ …

షార్జా – పాకిస్థాన్​కు పసికూన అఫ్ఘానిస్థాన్ భారీ షాక్​ ఇచ్చింది. షార్జా వేదికగా జరిగిన తొలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో అఫ్గాన్​ విజయం సాధించింది. టీ20ల్లో పాక్​ను ఓడించడం అఫ్ఘానిస్థాన్ ​కు ఇదే తొలిసారి. అయితే సీనియర్లు లేని లోటు పాకిస్థాన్​ టీమ్​పై గట్టి ప్రభావం చూపించింది. షాదాబ్​ఖాన్​ కెప్టెన్సీలో ఆ జట్టు ఘోర ప్రదర్శన కనబరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్​ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఇమాద్‌ వసీమ్‌(18), షాదాబ్‌ ఖాన్‌(23), సయీమ్‌ అయూబ్‌(17), తయూబ్‌ తాహిర్‌(16) మాత్రమే రెండు అంకెల స్కోరు దాటారు. మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. అఫ్ఘానిస్థాన్​ బౌలర్లలో ముజీబ్‌, నబీ, ఫజల్లా ఫరుఖీలు రెండు వికెట్లు పడగొట్టారు. అజ్మతుల్లా, నవీన్‌ హుల్‌ హక్‌, రషీద్‌ ఖాన్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.


స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘానిస్థాన్ జట్టు 17.5 ఓవరల్లోనే నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్​ను ఛేదించేసింది. మహ్మద్​ నబీ 38 పరుగుల నాటౌట్​తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. నజీబుల్లా జర్దన్‌ 17 నాటౌట్‌, రహమనుల్లా గుర్బాజ్‌ 16 పరుగులు చేశారు. ఇషానుల్లా రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్‌ షా, ఇమాద్‌ వసీమ్‌లు చెరొక వికెట్‌ తీశారు. ఆల్​రౌండర్​ ప్రదర్శనతో అదరగొట్టిన మహ్మద్​ నబీ.. ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement