Tuesday, April 30, 2024

Nzb: రోడ్డుకు మరమ్మతులు చేయాలని రోడ్డెక్కిన రైతన్నలు

నిజాంబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని బ్రహ్మణపల్లి నుంచి రెంజల్ మండలం దుపల్లి వరకు వెళ్ళే రోడ్డు పంటపొలాల మధ్య నుంచి వేళ్ళేమార్గం మరమ్మత్తు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామ రైతులు మంగళవారం ఎడపల్లి మండలంలోని సాటాపూర్ గేట్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. సుమారు అరగంట పాటు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో రోడ్డు కిరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ దారి గుండా రెంజల్, దుపల్లి గ్రామాలకు, స్థానిక పంట పొలాలకు లింక్ రోడ్డుగా ఉన్నందున రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రోడ్డు చినుకుపడితే గుంతలమయంగా మారి రాకపోకలకు రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో ఈవిషయంపై సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన రైతులు మంగళవారం రోడ్డెక్కారు. సమాచారం అందుకున్న ఎడపల్లి పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి రైతుల సమస్య ఉన్నతాధికారులకు చేరవేసి ఆందోళన విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement