Friday, May 3, 2024

సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలో నూతనంగా నిర్మించిన నిజామాబాద్‌ జిల్లా సమీకృత కలెక్టరేట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాల్లో సకల సదుపాయాలతో సమీకృత కలెక్టరేట్లను నిర్మించేందుకు నిర్ణయించిన విషయం విధితమే. ఇందులో భాగంగా నిజామాబాద్‌లో సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం సకల సదుపాయాలతో సమీకృత కలెక్టరేట్‌ను నిర్మించింది. నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement